Hanuman : “జై హనుమాన్” వచ్చే యేడాది రాకపోవచ్చు- తేజ సజ్జా

టాలీవుడ్ లో ఈ ఇయర్ ఎవరూ ఊహించని సంచలన చిత్రం ఏదైనా ఉందంటే అది “హనుమాన్” చిత్రమనే చెప్పాలి. ఒక ఫిక్షనల్ డ్రామాని ఇప్పటి జెనరేషన్ కి నచ్చేలా ఆంజనేయుడి కథకి లింక్ చేసి తీసిన ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా, తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా దాదాపు 300 కోట్లకి పైగా కలెక్షన్లు వసూలు చేసింది.

టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల తర్వాత 100 కోట్ల లాభాలు తీసుకొచ్చిన ఏకైక సినిమాగా హనుమాన్ నిలిచింది. ఇంకా పలు థియేటర్లలో హనుమాన్ ఇప్పటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. అయితే హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రూపొందుతుందని, 2025 లో ఆ సినిమా రాబోతుందని మేకర్స్ హనుమాన్ సినిమా ఎండింగ్ లో చూపించిన విషయం తెలిసిందే అయితే తాజాగా తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

తేజ సజ్జా తాజాగా మాట్లాడుతూ హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తాను ఇప్పుడు వేరే సినిమాలో నటిస్తున్నానని అంటుంటే జై హనుమాన్ గురించి మీడియా సమాధానం కోరగా, జై హనుమాన్ 2025 లో వస్తుందని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన మాట వాస్తవమే. అయితే ప్రశాంత్ వర్మ దాని కంటే ముందే వేరే ప్రాజెక్ట్ చేయనున్నాడు. జై హనుమాన్ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదని చెప్పాడు. దీంతో హనుమాన్ మూవీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ప్రశాంత్ వర్మ మల్టీ యూనివర్స్ లోనే భాగమైన ఈ సినిమా కాకుండా, అందులో వేరే సినిమా వస్తుందని సమాచారం. ఆ తరువాత జై హనుమాన్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు