Tarun : ఉన్నాడా.. లేడా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇది వరకే షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ నిర్మాతల సమ్మె వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా నిర్మాతల సమ్మె ముగియడంతో సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో SSMB28 షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.

అయితే ఈ చిత్రంలో పలువురు నటీనటులు చేస్తున్నారని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఒక్కసారి కూడా ఈ వార్తలపై స్పందించలేదు. కాగా ఇప్పటి వరకు వచ్చిన వార్తలలో టాలీవుడ్ హీరో తరుణ్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు అంటూ ఒకటి వచ్చింది. SSMB28లో ఒక కీలక పాత్రలో తరుణ్ నటిస్తున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తరుణ్ ను సంప్రదించారని, తరుణ్ వెంటనే మహేష్ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో చిత్రంలో తరుణ్ నటించడం లేదట. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని సినీ వర్గాల సమాచారంతో తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ చిత్రలో హీరోయిన్ గా పూజా హెగ్డే అధికారికంగా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అంతకు మించి ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయం కూడా అధికారికంగా తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు