Harish Shankar : చివరికి నిరాశే

హరీష్ శంకర్ టాలీవుడ్ లో ఒక మంచి దర్శకుడే. దీని కంటే, మెగా ఫ్యామిలీ అభిమాని అని చెప్పుచ్చు. అందుకే హరీష్ శంకర్ ఇప్పటి వరకు చేసిన ఏడు సినిమాల్లో నాలుగు మెగా హీరోలతోనే చేశాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుబ్రమణ్యం ఫర్ సేల్ చేశాడు. అలాగే అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, వరణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ తెరకెక్కించాడు.

దీని తర్వాత హరీష్ శంకర్ మరోసారి మెగా ఫ్యామిలీ హీరోనే ఎంచుకున్నాడు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దాదాపు మూడేళ్ల క్రితం పవర్ తో సినిమా చేయాలని హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అప్పటి నుండి అదిగో సినిమా ఇదిగో షూటింగ్ అంటూ వస్తున్నారు. కానీ, అది ఇప్పటి వరకు జరగలేదు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ కళ్యాణ్ ఒక ఒప్పదం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం, మైత్రీ-పవన్ కాంబో సినిమా వస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ తో చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. అదే భవదీయుడు భగత్ సింగ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే, పవన్ పాలిటిక్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. హరీష్ కూడా మరో సినిమా చేయకుండా, పవన్ కోసమే వెయిట్ చేస్తూ వచ్చాడు. ఈ సినిమా రావడం కష్టమే అని, పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.

- Advertisement -

కానీ, ఇటీవల పవన్ కు స్టోరీని హరీష్ శంకర్ మళ్లి చెప్పాడని, ఆ స్టోరీలో పవన్ మార్పులు కోరాడని మేకర్స్ నుండి సమాచారం వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆశలు చిగురించాయి. కానీ, మళ్లీ ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. మైత్రీ-పవన్ ప్రాజెక్ట్ కు హరీష్ శంకర్ వద్దని పవన్ నిర్ణయం తీసుకున్నాడట. హరీష్ స్థానంలో మరో డైరెక్టర్ ను సెర్చ్ చేయాలని నిర్మాతలకు సూచించారట.

ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, ఒక వేళ ఈ వార్తలు వాస్తవమే అయితే, హరీష్ శంకర్ మూడేళ్ల ఎదురుచూపునకు నిరాశ తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు