Hanuman Movie: ప్రశాంత్ వర్మ, ‘హనుమాన్’ నిర్మాత మధ్య ఫైనాన్షియల్ గొడవలు… జై హనుమాన్‌పై ఎఫెక్ట్?

Hanuman Movie

“హనుమాన్” మూవీ అనుకోని సక్సెస్ నిర్మాతకు, డైరెక్టర్ కు మధ్య చిచ్చు పెట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి మధ్య ప్రస్తుతం ఫైనాన్షియల్ ఫైట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ కరెక్ట్ గా టైం చూసి నిర్మాతకు షాక్ ఇచ్చాడు. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ ఏంటి? దానివల్ల సీక్వెల్ గా రాబోతున్న “జై హనుమాన్”పై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ “హనుమాన్”. చిన్న సినిమాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన “హనుమాన్”కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో నిర్మాతలు అనూహ్యమైన లాభాలు అందుకున్నారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని, మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీని తొక్కిపడేసి, సంక్రాంతి విన్నర్ గా నిలిచారు “హనుమాన్” టీం. ఇక ఈ సినిమా రిలీజ్ టైంలో సమస్యలు ఎదురైనప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ, నిర్మాత నిరంజన్ రెడ్డి ఒకే తాటిపై నిలబడ్డారు. కానీ “హనుమాన్” సక్సెస్ వీళ్ళ మధ్య చిచ్చు రేపింది. పారితోషికం విషయంలో ప్రస్తుతం నిర్మాతకు, దర్శకుడికి మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా కొంతవరకు అడ్వాన్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో ఫైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

నిజానికి ప్రశాంత్ వర్మ “హనుమాన్” మూవీని చేస్తున్న సమయంలోనే 3-4 కోట్లు అడ్వాన్స్ గా రెమ్యూనరేషన్ అందుకున్నారు. మిగతాది సినిమా లాభాల్లో వాటా తీసుకుంటానని నిర్మాత నిరంజన్ రెడ్డితో డైరెక్టర్ మాట్లాడుకున్నారట. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా “హనుమాన్” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం, 100 కోట్ల భారీ లాభాలు రాబట్టడంతో ప్రశాంత్ వర్మ బేరాలు మొదలు పెట్టారట. ఈ సినిమా లాభాల్లో 30 కోట్లు తనకు షేర్ ఇవ్వాలని అడుగుతున్నారట.

అక్కడితో ఆగకుండా “హనుమాన్” సీక్వెల్ “జై హనుమాన్” మూవీనీ రూపొందించడానికి పారితోషకంగా మరో 30 కోట్లు అడ్వాన్స్, లాభాల్లో వాటా కావాలని ముందే మెలిక పెడుతున్నారట. ప్రస్తుతం “జై హనుమాన్” మూవీపై జనాల్లో ఎంతటి ఆసక్తి నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రజలు “జై హనుమాన్” మూవీ గురించి ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి మంచి టైం చూసి ప్రశాంత్ వర్మ పెద్ద షాకే ఇచ్చాడు.

ఒకవేళ నిరంజన్ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కండిషన్ కు ఒప్పుకోకపోతే “జై హనుమాన్”పై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ వివాదం మరింత ముదిరితే ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి అనుకోని సక్సెస్ ను తెచ్చిపెట్టిన “హనుమాన్” వల్ల నిర్మతకు, డైరెక్టర్ కు సంతోషం లేకుండా పోయింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అడిగినంత నిర్మాత నిరంజన్ రెడ్డి ఇచ్చుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు