Chiranjeevi : గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

టాలీవుడ్ డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. లైగర్ ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతుంది. దీని తర్వాత మరోసారి రౌడీ హీరోతోనే జన గణ మన అనే సినిమాను చేస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సమయంలో పూరీ జగన్నాథ్ తో సినిమా ఉంటుందని ప్రచారం సాగింది. చిరంజీవి, పూరీ కూడా కొన్ని సందర్భాల్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. చిరు-పూరీ ప్రాజెక్ట్ కు ఆటో జానీ అనే టైటిల్ ఖరారు అయింది. ఈ టైటిల్ ను ఫిలీం ఛాంబర్ లో కూడా నమోదు చేశారు.

కానీ, ఆటో జానీ అర్ధాంతరంగా ఆగిపోయింది. స్టోరీలో సెకండ్ ఆఫ్ చిరుకు నచ్చలేదట. కొన్ని మార్పులు చేయాలని పూరీకి సూచించాడట. కానీ మార్పులు చేయడం పూరీకి నచ్చలేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆటో జానీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. చిరు-పూరీ కాంబినేషన్ లో ఆటో జాని రాబోతుందని సమాచారం అందుతుంది. అందుకే చిరు-పూరీ ఈ మధ్య కాలంలో సన్నీహితంగా ఉంటున్నారని టాక్.

చిరంజీవి గాడ్ ఫాదర్ లో పూరీ జగన్నాథ్ ఒక పాత్ర చేస్తున్న సంగతి విధితమే. అలాగే సోమవారం గాడ్ ఫాదర్ సెట్ లో లైగర్ టీం కలిసింది. ఈ మీటింగ్ సమయంలో చిరు-పూరీ ఏకాంతంగా చర్చించుకున్నారని టాక్. అది ఆటోజానీ కోసమే అని అంటున్నారు పూరీ ఫ్యాన్స్. అయితే ఆటో జానీ చేయాలని పూరీని మెగా ఫ్యాన్స్ కూడా ఆడుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పూరీకి చాలా సార్లు ప్రశ్నలు వచ్చాయి. ప్రతిసారి అన్నయ్య ఎప్పుడు ఒకే అంటే అప్పుడే అంటూ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఆటోజానీకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని బోగట్టా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు