మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లు శిరీష్ గౌరవం సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యాడు. ఇప్పటివరకు శిరిష్ నుంచి ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకోలేదనే చెప్పవచ్చు. శిరిష్ సినిమాలు అన్ని కూడా యావరేజ్గానే ఆడాయి. సాలిడ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.
తాజాగా ‘ఊర్వశివో రాక్షశివో’ అనే సినిమాతో వస్తున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో విజయ్-వీరాజ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అను ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి విజేత సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు అల్లు శిరిష్.
ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అక్టోబర్ 30న గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఓ స్టార్ హీరో రాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ వీరిద్దరిలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశముంది. ఎక్కువగా సోషల్ మీడియాలో బాలకృష్ణ పేరు వినబడడం విశేషం. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్, బాలయ్య ఇద్దరిలో చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తారో వేచి చూడాలి.