Ajay Bhupathi : బాలీవుడ్ ఎంట్రీ ?

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు డైరెక్టర్ అజయ్ భూపతి. యూత్ ఆడియన్స్ కోరుకునే “RX 100” వంటి మూవీని ప్రేక్షకుల ముందుంచి భారీ విజయాన్ని సాధించాడు. దీంతో ఒక్కసారిగా అజయ్ పేరు టాలీవుడ్ లో మార్మోగింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ భూపతి ఈ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు.

తన రెండో సినిమా శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన “మహాసముద్రం” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మహాసముద్రం నిరాశపరిచినందుకు అజయ్ భూపతి క్షమాపణలు కూడా కోరాడు. అయితే తాజాగా అజయ్ భూపతి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అజయ్ భూపతి త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు.

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు బాగున్నాయని, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు అజయ్ భూపతిని రాజ్ కుమార్ హీరానీ బాలీవుడ్ కి పరిచయం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిగాయని, రాజ్ కుమార్ హిరానీ రాసుకున్న కథకు అజయ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఈ చిత్రం గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు