Biggboss season7: తిరిగి తిరిగి మళ్ళీ చికెన్ ముక్కల దగ్గరకొచ్చింది?

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 పదో వారం ముగిసి పదకొండో వారాలోకి ఎంటర్ అయింది. ఇక పదో వారం లో బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్ల రాకతో కొంత వరకు కొట్లాట తగ్గగా, కెప్టెన్సీ టాస్క్ కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఒక్క గేమ్ తో సరిపెట్టేసారు. అందుకే లాస్ట్ వీక్స్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికి పస లేకుండా పోయింది. కానీ ఈ వారం మాత్రం నామినేషన్స్ తో పాటు ఇతర టాస్క్ లతో రసవత్తరంగా సాగనుందని తెలుస్తుంది.

అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ గా ఉన్న పది మంది కంటెస్టెంట్లలో ఎవరు ఏ స్థానంలో ఉంటారో, హౌస్ మేట్స్ నే చర్చించుకొని తమ అభిప్రాయంగా చెప్పాల్సింది గా బిగ్ బాస్ ఆర్డర్ వేసాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ మంది తమను తాము టాప్ 5 లో ఖచ్చితంగా పెట్టుకుంటూ తక్కువ స్థానాలకు తన వ్యతిరేకుల్ని నామినేట్ చేసారు.

అయితే ఈ టాస్క్ లో భాగంగా శోభా శెట్టి ని ఒక కంటెస్టెంట్ 7వ స్థానానికి పరిమితం అవుతుందని నామినేట్ చేసాడు. అయితే ఇది నామమాత్రపు వ్యక్తిగత టాస్క్ అయినప్పటికి ఫీల్ అయిపోయిన శోభా, తనని ఎడో ప్లేస్ డిసర్వ్ చేస్తున్నారంటూ ప్రియాంక, అమర్ లకి చెప్తూ ఫీల్ అవుతుంది. పైగా ఎప్పుడో హాట్ చికెన్ టాస్క్ లో గెలిచిన సంగతి చెప్తూ తనలా ఎవ్వరూ ఆడలేరంటూ అంటుంది. నిజానికి ఆరోజు కూడా గౌతమ్ గెలిచేవాడు అని తెలిసిందే. చిన్న మిస్టేక్ వల్ల శోభా ని విన్ చేసాడు సందీప్. ఇక ఆడియన్స్ మాత్రం శోభా మళ్ళీ చికెన్ ముక్కల దగ్గరికి వచ్చిందని ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు