Biggboss season7: శోభా కారణంగా ఇంటి సభ్యుల్ని పనిష్ చేసిన బిగ్ బాస్..!

బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ టాస్క్ లో ఉన్న ఎనిమిది మందిలో ఒక్కొక్కరిగా ఒక్కో ఛాలెంజ్ లో ఊడిపోతూ టాస్క్ నుండి బయటికి వచ్చేయగా, చివరగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఈ రేసులో నిలిచారు. అమర్ దీప్, అర్జున్, ప్రశాంత్ ఈ టాస్క్ ని ఆడుతుండగా, పదో ఛాలెంజ్ గా ఒక టేబుల్ మీద బాల్స్ ని ఆర్డర్ లో పెట్టమని బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చాడు.

అయితే ఈ టాస్క్ లో ముందు అమర్ గంట కొట్టగా, ఎవరు గెలిచారో నైట్ టెలికాస్ట్ అవబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఛాలెంజ్ అయిపోగాక మధ్యలో శోభా శెట్టి కూడా సరదాగా ఆ ఛాలెంజ్ లో బాల్స్ ని సరిచేస్తూ ఆడుతుంది.

అయితే ఉన్నపళంగా శోభా ని పనిష్ చేస్తానంటూ బిగ్ బాస్ చెప్తూ ఇంటి సభ్యుల్ని షాక్ చేసాడు. శోభా చేసిన పని వల్ల శోభా తో పాటు హౌస్ మేట్స్ కి కూడా పనిష్మెంట్ ఉంటుందని అన్నారు. అయితే ఆ మాట చెప్పిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందర్నీ ఒక గంట సేపు పడుకోమని చెప్పాడు.

- Advertisement -

అదేంటి? బిగ్ బాస్ పనిష్ చేస్తాడనుకుంటే కూల్ గా పడుకోమని చెప్పాడు , అని ఆలోచించకుండా హ్యాపిగా ఫీల్ అయిన కంటెస్టెంట్స్ వెంటనే వాళ్ళ రూమ్స్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అయితే బిగ్ బాస్ ఇలా అనడం వెనుక వాళ్ళు నిద్ర లేచాక బిగ్ బాస్ ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తాడా అని ఆడియన్స్ భావిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు