యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు “మహానటి” ఫెమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ నెలకొన్న భారీ బడ్జెట్ సినిమాలలో ప్రాజెక్ట్ కే ఒకటి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 70% చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. సుమారు 500 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చేసాయి.
కానీ ఇప్పుడు కొత్తగా ఇది పురాణాలను, టైం మిషన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ వస్తున్న మైథాలజికల్ ఫాంటసీ అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. విష్ణుమూర్తి కల్కి అవతారం కథ. అలాగే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ పాత్రలను బేస్ చేసుకుని ఈ కథ సాగుతుందట. అయితే ప్రాజెక్టు కే గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నిర్మాత అశ్విని దత్ వెల్లడించారు.
ప్రాజెక్ట్ కే సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఆధునిక విష్ణుమూర్తికి సంబంధించి ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో భారీగా గ్రాఫిక్స్, ఎమోషన్లు, సెంటిమెంట్ కూడా బలంగా ఉంటాయని ఆయన చెప్పుకోచ్చారు. దీంతో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రంలో విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తాడేమోనని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News