Rakul Preet Singh: షాకింగ్ కామెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. యంగ్ హీరో సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అప్పటి నుంచి స్టార్ హీరోలతో ఛాన్స్ లను కొట్టేస్తూ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఎక్కువ కనిపించలేదు. కోలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికే షిఫ్ట్ అయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించింది. చివరిసారిగా, పంజా వైష్టవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో నటించింది. దీని తర్వాత మళ్లీ రకుల్ కనిపించలేదు.

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది, అలానే ఈమె చేతిలో కోలీవుడ్ చిత్రం ఉంది. కానీ, తెలుగు చిత్రం ఒకటి కూడా లేదు. రీసెంట్ గా రకుల్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. రకుల్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. బాలీవుడ్, సౌత్ మూవీస్ రెండు ఒకటే అని.. వాటిని వేర్వేరుగా చూడొద్దని, దేశంలో ప్రతిభగల దర్శకులు ఉన్నారని,వారు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం… అంటూ చెప్పుకొచ్చింది.

అయితే రకుల్ చేసిన కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. వాస్తవానికి బాలీవుడ్, సౌత్ మూవీస్ రెండు ఒకటే అనడం కొందరు జీరించుకోలేకపోతున్నారు. గతంలో దక్షిణాది చిత్రాలతోనే గుర్తింపు వచ్చిన విషయాన్ని మర్చిపోయావా అంటూ రకుల్ ను ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు