గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన సరికొత్త కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రం గీత. టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైనటువంటి వి వి వినాయక్ శిష్యుడు విశ్వ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి మ్యూట్ విట్నెస్ అనేది ఉప శీర్షిక. అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ మీడియాతో మాట్లాడారు. తన శిష్యుడు విశ్వకు మంచి పేరు ఉందని, అదేవిధంగా తన మరో మిత్రుడు రాచయ్యకి డబ్బు తీసుకొచ్చే మంచి చిత్రంగా గీత నిలవాలని కోరారు. గీత చిత్రం విజయం సాధించాలని అభినందించడం చాలా సంతోషకరమని నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వ్యక్తం చేశారు.
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితర తారాగణం నటిస్తున్నారు.