రజినీకాంత్ తాను చేసే సినిమాల స్టోరీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే రజినీ… అలాంటి స్టోరీలను కూడా టచ్ కూడా చేయడు. అయితే ప్రస్తుతం రజినీకాంత్ చేస్తున్న మూవీ లాల్ సలాం. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. రజినీ కాంత్ గెస్ట్ రోల్. దీపావళి సందర్భంగా లాల్ సలాం మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ని చూస్తే.. క్రికెట్ ఆటతో రెండు వర్గాల మధ్య జరిగే పోరు అని తెలుస్తుంది.
నిజానికి స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. సై నుంచి స్టార్ట్ చేస్తే చాలా సినిమాలు స్టోర్ట్స్ ఆధారంగా ఉన్నాయి. అయితే అవి ఒక ప్లేస్ గురించో… అమ్మాయి ప్రేమ గురించో ఉండేవి. కానీ, లాల్ సలాం సినిమాలో రెండు వర్గాలు ఒక అంశం గురించి ఫైట్ చేసుకుంటారు. అంత వరకు పెద్దగా కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ లేదు.
కానీ, టీజర్ స్టార్టింగ్ లో… క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ కామెంట్రీ వినిపిస్తుంది. “ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ని టీవీల్లో చూసి ఉంటారు… రెడియోల్లో విని ఉంటారు… కానీ డైరెక్ట్ గా చూశారా? ఇదిగో ఇప్పుడు మన ఊరిలో.. మన ఊరి మైదానంలో డైరెక్ట్ గా చూడబోతున్నారు. జరిగేది కేవలం పోటీ మాత్రమే కాదండి.. వార్”
అక్కడ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ ని ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ లా పోలుస్తున్నారు. అలాగే ఇది కేవలం ఆట మాత్రమే కాదు, వార్ అని చెబుతున్నారు. అంటే సినిమాలో ఒక సీరియస్ అంశాన్నే తీసుకున్నట్టు అయితే తెలుస్తుంది. ఎప్పుడు కాంట్రవర్సీల జోలికి పోని రజినీకాంత్… లాల్ సలాం స్టోరీని ఎందుకు ఒప్పుకున్నాడు అనే ప్రశ్న వస్తుంది. అయితే దీనికి సమాధానం.. లాల్ సలాం సినిమాను డైరెక్ట్ చేస్తుంది రజినీకాంత్ కూతురు ఐశ్వర్య.
ఈమె ఇప్పటి వరకు మూడు సినిమాలను డైరెక్ట్ చేసింది. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. నాలుగో సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఏకంగా రజినీకాంత్ రంగంలోకి దిగాడు. అందుకే లాల్ సలాంలోని మొయిదీన్ భాయ్ పాత్ర చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ వస్తుంది.
Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.