కోలీవుడ్ స్టార్ విశాల్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ “మార్క్ ఆంటోనీ” బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు 100కోట్లకి పైగా భారీ వసూళ్ళని అందుకుంది. ఇక ఈ సినిమాతో విశాల్ ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇక విశాల్ తాజాగా తమిళ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వీరి కాంబో లో వచ్చిన భరణి, పూజ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవగా, హ్యాట్రిక్ హిట్ కోసం చేతులు కలిపారు.
ఇక హరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విశాల్ సొంత బ్యానర్ అయిన “విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్లోనే తెరకెక్కనుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి సాలిడ్ అప్డేట్ ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు విశాల్. విశాల్ 34వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్లు అయిన గౌతమ్ మీనన్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారని అనౌన్స్ చేసాడు. దాంతో పాటు హరి తో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్ల తో సెట్స్ లో ఉన్న స్టిల్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాడు.
ఇక విశాల్ హరి కాంబో సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు డిటెక్టివ్2 సినిమా తీస్తున్నానని ఈ ట్వీట్ లోనే చెప్పడం జరిగింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News