Liger : ఇంట్లో కుర్చోవాలా ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న చిత్రం “లైగర్”. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తీసుకురాగా.. సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మొదటిసారి బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంతో దక్షిణాదికి పరిచయం కాబోతోంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా విజయవాడలో సందడి చేసింది లైగర్ చిత్ర యూనిట్.

ఈ ప్రమోషన్లలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, పూరి జగన్నాథ్, చార్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మూడేళ్ల నుండి లైగర్ సినిమా తీస్తున్నామని అన్నారు. ప్రాణం పెట్టి ఈ సినిమా తీశామని.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు విజయ్. పూరి కథ చెప్పగానే మెంటల్ వచ్చిందని, వెంటనే ఓకే చెప్పేసానని అన్నారు. ఈ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే కరణ్ జోహార్ అని తెలిపారు. మూడేళ్లు కష్టపడి సినిమా తీసి ఇంట్లో కూర్చోవాలా అని అన్నారు.

తాము ధర్మంతో ఉన్నామని ఏది వచ్చినా కొట్లాడుడే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లి సెంటిమెంట్ తో ఇండియా ఫ్లాగ్ ఎగురవేస్తే, బాయ్ కాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. అలాగే లైగర్ ఓ యాక్షన్ డ్రామా అని, ఓ కుర్రోడిని తీసుకొని తల్లి ముంబైకు తీసుకెళ్లి బాక్సర్ ను చేస్తోందంటూ స్టోరీ హింట్ ఇచ్చారు పూరీ. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసే సినిమా కాదని, పక్క థియేటర్ లో చూడాల్సిన సినిమా అని పూరీ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు