Veera Simha Reddy : ఒక పాట మినహా..

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీర సింహా రెడ్డి. డాన్ శీన్, బాడిగార్డ్, బలుపు తో పాటు ఇటీవల సంచలన విషయం సాధించిన క్రాక్ వంటి సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 70 కోట్ల బడ్జెట్ తో వీర సింహా రెడ్డిని మూత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతుంది. దీనిలో దాదాపు 11 ఫైట్స్ ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా దాదాపు పూర్తి అయింది. చివరి షెడ్యూల్ లో ఈ పాటను కూడా పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం నుంచి చివరి షెడ్యూల్ జరగబోతుంది. దీనికి బాలయ్య తో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా డేట్స్ ఇచ్చేశారు.

దీంతో ఈ నెల 18 నుంచి చివరి షెడ్యూల్ గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. ఈ చివరి షెడ్యూల్ లో ఒక పాటతో పాటు బ్యాలన్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేస్తారని సమాచారం అందుతుంది. దీని తర్వాత ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు