తెలుగులో విజయవంతమైన టాక్ షోలలో అన్స్టాపబుల్ విత్ ఎన్బికె ది ఒక ప్రత్యేకమైన స్థానం.ఈ షో మొదలైనప్పుడు బాలయ్య ఏంటి, అతనితో టాక్ షో అని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తూ షోని టాప్ పొజిషన్లో నిలబెట్టారు. ఇటీవలే మొదలైన సీజన్ 2 కూడా విజయవంతంగా రన్ అవుతుంది.
బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విజయపథంలో దూసుకెళ్తోంది. మొదటి ఎపిసోడ్కి గెస్ట్లుగా నారా చంద్రబాబునాయుడు, లోకేష్ రాగా.. రెండో ఎపిసోడ్కి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. మూడో ఎపిసోడ్కి యువ హీరోలు శర్వానంద్, అడివిశేష్ వచ్చారు. ఈ హీరోలతో బాలయ్య చేసిన హోస్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ ఇచ్చారు.
రెండవ ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్ లో ముచ్చటించారు.ఆ సంభాషణలో ‘ఈ షోకు ఎప్పుడు వస్తావ్’ అని త్రివిక్రమ్ ను బాలకృష్ణ అడిగారు. ‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాన’ని త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు. అయితే వెంటనే బాలకృష్ణ… ‘ఎవరితో రావాలో తెలుసుగా’ అని అడిగారు. త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ చేసే ప్రతిపనిలోను త్రివిక్రమ్ పరోక్షంగా నిలబడతారు అని వార్తలు కూడా వింటూనే ఉంటాం.
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం అన్స్టాపబుల్ విత్ ఎన్బికె కి పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా రమ్మని అడుగగా పవన్ కళ్యాణ్ గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాములుగా ఇంటర్వ్యూస్ కి పెద్దగా హాజరుకాని పవన్ ఈ షో రాబోతుండటం విశేషం అని చెప్పొచ్చు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.