SSMB 28 : రెండో షెడ్యూల్ అప్పుడేనా !

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హేష్ త‌న కెరీర్‌లో 28వ సినిమాగా వ‌స్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియోను కూడా వ‌దిలింది చిత్ర బృందం. ఆ వీడియోకు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో చాలా గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. అక్క‌డే ఓ వారం రోజుల పాటు షూట్ చేశారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్ష‌న్ స‌న్నివేశాలను చిత్రీక‌రించార‌ట‌. మ‌రోవైపు రెండో షెడ్యూల్‌ని ద‌స‌రా త‌రువాత ప్రారంభించ‌నున్న‌ట్టు నిర్మాత నాగ‌వంశీ తెలిపారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్ర‌త్యేక సెట్‌లో షూట్ రెస్యూమ్ కానున్న‌ద‌ట‌. దాదాపు 12 సంవ‌త్స‌రాల‌ త‌రువాత మ‌హేష్‌బాబుతో చేస్తున్న ఈసినిమాని త్రివిక్ర‌మ్ అంద‌రి అంచ‌నాలు అందుకునేవిధంగా తెర‌కెక్కిస్తున్నార‌ట‌.

ప్రేక్ష‌కులు ఊహించిన‌దాని కంటే ఎక్కువ‌గా ఈ సినిమాకు మార్కెట్ జ‌రుగుతోంద‌ట‌. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత‌లు ఓవ‌ర్‌సిస్ రైట్స్ కోసం రూ.23కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట‌. ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. హిందీ డ‌బ్బింగ్‌తో పాటు డిజిట‌ల్ రైట్స్ మాత్రం రూ.30కోట్ల రేంజ్ ప‌ల‌క‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక రెండో షెడ్యూల్‌లో హీరో మ‌హేష్ బాబుతో పాటు బుట్ట‌బొమ్మ పూజాహెగ్దేపై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నట్టు నిర్మాత నాగ‌వంశీ తెలిపారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు