Samantha : ఏ ప్రాజెక్టు నుంచి తప్పుకోలేదు

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత పేరు ప్రస్తుతం వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. యశోద సినిమాకు ముందు సామ్ కు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్టార్ హీరోయిన్ బయట కనిపించడం లేదు. దీని వల్ల సామ్ తెలుగులో ఇప్పటికే సైన్ చేసిన ఖుషి సినిమా వాయిదా పడింది. ఖుషి సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటు సామ్ బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి దర్శకులు రాజ్ అండ్ డీకే తో కూడా ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా వీరితో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. దీనిలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్స్ రుస్సో బ్రదర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ నుంచి ఇటీవల ఒక అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఇందులో సామ్ పేరు కనిపించలేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ నుంచి సమంత తప్పుకుందని, అలాగే ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై తాజాగా హీరోయిన్ సమంత పర్సనల్ టీం స్పందించింది. బాలీవుడ్ వెబ్ సిరీస్ నుంచి సమంత తప్పుకున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెల్చి చెప్పింది. సామ్ అసలు ఏ ప్రాజెక్టు నుంచి కూడా బయటకు రాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని సమంత టీం కోరింది. అలాగే సంక్రాంతి తర్వాత ఖుషి సినిమా షూటింగ్ లో సమంత పాల్గొంటుందని ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు