మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లక్ సినిమా తర్వాత కార్తిక్ దండు దర్వకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం SDT15 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా దీని నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇటీవల హీరో సాయి ధరమ్ తేజ్.. టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల7వ తేదీన అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ సినిమాలో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. దీనిపై మూవీ టీం అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ లో తారక్ వాయిస్ ఓవర్ ఉండబోతుందని, అలాగే ఈ నెల 7న రాబోయే టైటిల్ గ్లింప్స్ లో కూడా తారక్ వాయిస్ వినిపస్తుందని తెలుస్తుంది.
కాగా మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తొలి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తారక్ వాయిస్ కూడా సినిమాలో ఉండబోతుందని ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. కాగా ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
More love to you Tarak @tarak9999 ❤️
Thank you is a small word for the way you received me when I came to you.
It felt like the old days when I came to meet you before becoming an actor.Your voice has made our #SDTitleGlimpse magical#NTRforSDT will always be special for me 🤗 pic.twitter.com/UxYhXSbNE7
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 5, 2022