Ranbir Kapoor: రామాయణంపై రాబోతున్న మరో భారీ సినిమా ! ఈసారి ఆదిపురుష్ కి మించి..

రామాయణం ఆధారంగా బాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో మరో సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా విడుదలకి సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ న్యూస్ బయటికి రావడంతో అందరు దృష్టి ఇప్పుడు ఈ సినిమాపై పడింది.

ప్రభాస్, కృతిసనన్ జంటగా నడిచిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం అందరికి తెలిసిందే. వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇటీవలనే రిలీజైన సినిమాకి సంబంధించి ట్రైలర్ లు, పాటలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకోగా.. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఆదిపురుష్ ఇంకా విడుదల కాక మునుపే మరో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామాయణ్ పేరుతో సినిమా ప్లాన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని తీయబోయే డైరెక్టర్ ఎవరో కాదు నితీష్ తివారి. దంగల్, చిచోరే లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ స్టార్ డైరెక్టర్ రామాయణాన్ని సినిమాగా తీయడానికి శ్రీకారం చుట్టాడని వార్త. అయితే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా అలియా భట్ నటించబోతున్నారట. రావణుడి పాత్ర కోసం కన్నడ రాక్ స్టార్ కెజిఎఫ్ ఫేం యాష్ ని సంప్రదించినట్టు సమాచారం.

- Advertisement -

ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి రణ్ బీర్ కపూర్ కి మరియు అలియా భట్ కి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఈ దీపావళికి ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తారని టాక్. అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు