Tollywood : బిగ్ షాక్… 10 రోజులు థియేటర్లు బంద్ ఎందుకంటే?

Tollywood : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూవీ లవర్స్ కి షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణలో 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. మరి థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

ఇదే కారణమా?

ఓ వైపు ఐపిఎల్ సీజన్, మరోవైపు ఎలక్షన్ హడావిడి… ఈ నేపథ్యంలోనే జనాలు థియేటర్ల వైపు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంతేకాకుండా జనాలను థియేటర్లలోకి రప్పించగలిగే సినిమాలేవి ఇటీవల కాలంలో విడుదల కాలేదు. అలాంటి పెద్ద సినిమా రిలీజ్ కావాలంటే జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతలోపు వచ్చే సినిమాలన్నీ చిన్న, మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలే. ఇక ప్రస్తుతం ఐపీఎల్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుండడంతో జనాలు అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. సాధారణంగానే ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే సినిమాలకు నష్టకాలం వచ్చినట్టే.

10 రోజులు థియేటర్లు బంద్

ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో సింగల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు షాకింగ్ నిర్ణయానికి వచ్చాయి. ఏకంగా 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు బంద్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడమే దీనికి కారణం అని తెలుస్తోంది. అయితే మూవీ లవర్స్ కి మాత్రం ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఎప్పటి నుంచి బంద్ అంటే?

ఇక ఈ శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయకూడదని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఎన్నికలతో పాటు ఇతర కారణాలతో ఇటీవల రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సినిమా హాల్లోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఊహించని రేంజ్ లో తగ్గిపోయింది. సిటీలలో పోలిస్తే మిగతా ప్రాంతాలలో ఆక్యుపెన్సీ మరింత దారుణంగా ఉండడంతో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చిన సమాచారం.

ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటి?

అయితే మరి ఈ శుక్రవారం రిలీజ్ కానున్న సినిమాల పరిస్థితి ఏంటి అన్న విషయం తెలియాల్సి ఉంది. నెక్స్ట్ వీక్ కు ఆ సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సత్యభామ, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాలు థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల బంద్ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు సింగిల్ స్క్రీన్ లలో కాకుండా మిగిలిన థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

tollywood-Theatres to be closed for 10 days in Telangana
tollywood Theatres to be closed for 10 days in Telangana

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సత్యభామ ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. మే 17న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు అనిరుధ్ పవిత్రన్, రవివర్మ, హర్షవర్ధన్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు రొమాంటిక్-డ్రామా రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంకితా ఖరత్, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్, రాకెట్ రాఘవ, చక్రపాణి ఆనంద, భూషణ్ కళ్యాణ్, పవన్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. రాజు యాదవ్ మూవీని మే 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు