Jailer : 25 ఏళ్ల తర్వాత..

నరసింహ – నీలాంబరి.. తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాత్రలు. రజినీకాంత్ – రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన నరసింహా సినిమా సంచలనం సృష్టించింది. అయితే మరోసారి ఒకే చిత్రంలో వీరిద్దరూ కనువిందు చేయనున్నారు. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జైలర్”. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించనున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా ఒక జైలు సెట్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్, తమన్నా, ప్రియాంక మోహన్, శాండల్ ఉడ్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు రాగా, తాజాగా ఈ కాంబోను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ను సోమవారం నుంచి ప్రారంభించారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది రమ్యకృష్ణకు. మరి ఈ జంట మరోసారి మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు