Adhipurush :ప్రమోషన్స్ లో కనిపించని ప్రభాస్ సినిమా

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ” ఆదిపురుష్‘ వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా ఇటీవలనే రిలీజైన ట్రైలర్ తో అందరిని ఆకట్టుకుంది.

ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. 3డి లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల (జూన్ ) 16న విడుదలకి సిద్ధమవుతోంది. అంటే ఈ సినిమా రిలీజ్ కి సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉంది. కాగా ప్రమోషన్స్ లో మాత్రం సినిమా ఎవరికీ కనిపించటం లేదు. ట్రైలర్ రిలీజ్ రోజున హంగామా తప్ప.. ఈరోజు వరకు కూడా సినిమాకి సంబంధించిన పోస్టర్స్ మినహా ఎలాంటి ప్రమోషనల్ అప్డేట్ రాలేదు.

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గతంలో గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దాంతో ఆదిపురుష్ టీం కొంత సమయం తీసుకొని, రిలీజ్ డేట్ వాయిదా వేసుకొని మరీ విఎఫ్ఎక్స్ పై వర్క్ చేసారు. దాంతో ఓవర్ అల్ బడ్జెట్ 700 కోట్ల వరకు అయింది.

- Advertisement -

మరీ ఇంత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి. బాహుబలి, RRR సినిమాలని చూసుకుంటే షూటింగ్ పూర్తి అయిన తరువాత రోజు నుంచే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. రిలీజ్ డేట్ వరకు కూడా ఎదో రకమైన న్యూస్ తో సినిమా ఎప్పుడు జనాల నోట్లో సినిమా పేరు నానుతూ వచ్చింది. ప్రతి ఒక్కరికి సినిమాని రీచ్ అయ్యేలా చేయడం వల్లే ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి. ఈ రోజు వరకు కూడా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆదిపురుష్ సంగతి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సినిమా తీసేసాం, రిలీజ్ సంగతి రాముడు చూసుకుంటాడులే అన్నట్టే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఇప్పటికైన సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, సినిమాని జనాల్లోకి తీసుకెళ్లకపోతే 700 కోట్లకి నిండా మునిగినట్టే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు