Nayanthara: ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కొనసాగడం చిన్న విషయం కాదు

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ కనెక్ట్. నయనతారతో గతంలో మాయ(తెలుగులో మయూరి), తాప్సీ తో గేమ్ ఓవర్ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వాన ఫెమ్ వినయ్ రాయ్, సత్యరాజ్, అనుపమ్ కేర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నయనతార, వినయ్ రాయ్ భార్యాభర్తలుగా నటించారు. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ సినిమా ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. ఈ మూవీ విజయం పై హర్షం వ్యక్తం చేసింది నయనతార. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందిస్తుందని తెలిపింది. అలాగే ఈ ఏడాది పూర్తిస్థాయి బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. చిన్నదా, పెద్దదా లేదా పాన్ ఇండియా స్థాయి అని చూడడం లేదు అన్నారు. అందుకే కనెక్ట్ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేశామని చెప్పుకొచ్చారు.

ఇక సినీ పరిశ్రమలో తన 20 ఏళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. నా సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న. ఇప్పుడు అంతా బాగుంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్న. నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయంతో నా బాధ్యత మరింత పెరుగుతుంది. నా ప్రమాణాలను ఎప్పటికీ కాపాడుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం నయనతార బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు