Nayanthara: భక్తులపై నయన్ సీరియస్… పెళ్లి తర్వాత కళ్లు నెత్తికెక్కాయా !

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటించి అందం, అభినయంతో యువతను ఆకట్టుకున్న ఈమె కోలివుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్నా బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.

మరొకవైపు ఇరైవన్ అనే తమిళ సినిమాలో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా, గతేడాది దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెల్లాడిన నయనతార సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమ పిల్లల పూర్తి పేర్లను కూడా వెల్లడించారు. అయితే ఇటీవల కుంభకోణంలోని తమ ఇష్టదైవమైన ఆలయానికి వెళ్ళిన దంపతులు పూజలు నిర్వహించారు. కానీ అదే సమయంలో అక్కడున్న భక్తులపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే, ఏప్రిల్ 5న కుంభకోణం జిల్లాలోని ఆలయానికి వెళ్లారు నయనతార, విగ్నేష్ దంపతులు. వీరు పూజలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు గొడవకు దిగారు. అంతేకాకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో నయనతార భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఒక్క ఐదు నిమిషాలు ఆగండి. మా పూజా పూర్తవుతుంది. మేము మీలాగే దేవుడు ఆశీస్సుల కోసమే వచ్చాం” అని అన్నారు నయనతార. ఇది నార్మల్ గా కాకుండా, సీరియస్ వార్నింగ్ ఇచ్చేలా చెప్పింది.

- Advertisement -

దీనిపై నెట్టింట్లో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అభిమానులపై ఇలా విరుచుకపడటం సరికాదని, వారి వల్లే స్టార్ అయ్యావని కొంత మంది అంటున్నారు. అలాగే స్టార్స్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని, వారిని ఇబ్బంది పెట్టవద్దని అంటూ మరి కొంత మంది నయన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు