Nageswara Rao: నాగేశ్వరరావు చివరి క్షణాలు అంత దారుణంగా గడిచాయా..?

Nageswara Rao: తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90 ఏళ్ల జీవితంలో తెలుగు సినీ పరిశ్రమలో 75 ఏళ్లు తన హవా కొనసాగించారు. తెలుగు తెరపై నాగేశ్వరరావు ఒక సూపర్ హీరో అని కూడా చెప్పవచ్చు. ఎన్టీఆర్ కంటే ముందే స్టార్ హోదా అందుకున్న లెజెండరీ నటుడుగా పేరు సంపాదించారు నాగేశ్వరరావు. ఈయన చేయని పాత్ర అంటూ లేదు. చనిపోయే వరకు సినిమాలే శ్వాసగా బతికారు. ఏఎన్ఆర్ మరణించిన ఐదు నెలలకు “మనం” సినిమా విడుదలై మంచి విజయాన్ని అందించింది.

అయితే ఏఎన్ఆర్ మరణించే నాలుగు నెలల ముందు క్యాన్సర్ వచ్చిందట. తనకు క్యాన్సర్ వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను బ్రతికి చూపిస్తానంటూ కూడా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాగేశ్వరరావు చివరి రోజుల్లో ఆయన దగ్గరికి ఎవరిని రానించేవారు కాదట. ఆయన ఎలా ఉన్నారు.. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయన శరీరం ఎలా మారిపోయింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఏఎన్ఆర్ మరణించినప్పుడు మాత్రం అచ్చం నిద్రలో ఉన్నట్లుగానే కనిపించారట. ఇక ఏఎన్ఆర్ చివరి రోజుల్లో పరిస్థితిని నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ఏఎన్ఆర్ తన చివరి రోజుల్లో ఎవరిని అనుమతించేవారు కాదు.. కొన్ని నెలలపాటు నాగేశ్వరరావు ఒకే గదిలో పరిమితమయ్యారని తెలిపారు.. ఆ గదిలోకి వెళ్లాలంటే కేవలం కుటుంబ సభ్యులు తప్ప మరెవరిని అనుమతి ఇచ్చేవారు కాదని తెలిపారు కాదంబరి కిరణ్.. నాగేశ్వరరావుతో తనకున్న అనుబంధం వల్లే తనని మాత్రమే లోనికి అనుమతించే వారిని తెలిపారు.

- Advertisement -

ఏఎన్ఆర్ మరి కొద్ది రోజులలో మరణిస్తారనగా.. ఆయన శరీరం మరీ పల్చగా మారిపోయిందని.. ముట్టుకుంటే చర్మం కూడా ఊడిపోయేది అంటూ పలు విషయాలను తెలియజేశారు కాదంబరి కిరణ్.. అయితే అభిమానులు బాధపడతారు అన్న ఒక్క కారణంతోనే ఈ విషయాలను ఎవరికీ చెప్పలేదట.. ఇక ఆయనకు క్యాన్సర్ కారణంగా అలా అయిపోయింది అంటూ తెలియజేశారు. ఈ విషయం తెలిసి ఏఎన్ఆర్ అభిమానులు తమ అభిమాన హీరో చివరి రోజుల్లో ఇంతటి దీనమైన పరిస్థితిలో మరణించారా అంటూ ఎమోషనల్ అవుతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు