రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభ నటేష్ తెలుగులో క్రేజీ హీరోయిన్ అయిపొయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి, వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న రామ్, పూరి జగన్నాథ్ లకు సాలిడ్ హిట్ని ఇచ్చింది.
అయితే నభ నటేష్ మొదట సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైనా, ఈ బ్యూటీకి ఇస్మార్ట్ శంకర్ సినిమానే మంచి కమర్షియల్ బ్రేక్ ని ఇచ్చింది. ఈ సినిమా తరువాత నభ నటేష్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో నటించిన ఈ బ్యూటీకి, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఈమె జోరుకి బ్రేక్ పడింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బతుకే సో బెటర్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది.
రీసెంట్ గా నభ నటేష్.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనైన హిట్ పడుతుందేమో, కెరీర్ ముందుకెళ్తుందేమో అనుకుంటే ఈ సినిమా ఫ్లాప్ తో నభ కెరీర్ ని మరింత వెనక్కి నెట్టింది. ఆ తరువాత నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమాలో నటించగా, సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి రావడం వల్ల నాభ కి పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే నభకి యాక్టింగ్ తో పాటు పెయింటింగ్ హాబీ కూడా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో తన పెయింటింగ్ హాబీని డెవలప్ చేసుకుంటుంది. తాజాగా ఆమె.. చార్లీ చాప్లిన్ బొమ్మ గీసి, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. మనిషిగా, యాక్టర్ గా తాను చార్లీ చాప్లిన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్టు నభ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ కి సాయి ధరమ్ తేజ్ కామెంట్ పెట్టడంతో ప్రస్తుతంఈ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News