Mahesh Babu: కృష్ణ వ‌ర్థంతికి మ‌హేశ్ బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం..నిజంగా శ్రీమంతుడే..!

సూపర్ స్టార్ కృష్ణ ప్ర‌థ‌మ వ‌ర్థంతి న‌వంబ‌ర్ 15న జ‌రిగింది. దాంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు అభిమానుల‌కు కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. కాగా ఆయ‌న కుమారుడు స్టార్ హీరో మ‌హేశ్ బాబు సైతం సోష‌ల్ మీడియాలో తండ్రి ఫోటో షేర్ చేసి ఎప్పటికీ సూప‌ర్ స్టార్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. అంతే కాకుండా తండ్రి వ‌ర్థంతి రోజున మ‌హేశ్ బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలలోనూ ముందు ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు 40 మంది పేద విద్యార్థులను స్కాలర్ షిప్లు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సూపర్ స్టార్ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరిట 40 మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఈ స్కాలర్ షిప్ అందించాలని నిర్ణయించారు.

దాంతో మరోసారి మహేశ్ బాబు మరోసారి శ్రీమంతుడు అనిపించుకున్నారు. ఇక ఇప్పటికే మహేశ్ బాబు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేపిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అన్న సంగతి తెలిసిందే. 2020లో మహేశ్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి ఈ ఫౌండేషన్ ను స్థాపించారు. దీని ద్వారా ఇప్పటికే సుమారు 2500 మందికి గుండె ఆపరేషన్లు చెయించారు. అంతే కాకుండా తమ స్వగ్రామంలో పేద విద్యార్థుల కోసం ఓ పాఠశాలను కూడా నిర్మించారు. అలా తాను సంపాదించిన దానిని పూర్తిగా దాచుకోకుండా మహేశ్ బాబు సేవా కార్యక్రమాలతో కూడా రియల్ హీరో అనిపించుకుంటూ చాలా మంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం థియేటర్లలోకి రాబోతుంది. మరోవైపు త్రివిక్రమ్ మహేశ్ కాంబోలో వచ్చిన ఖలేజా, అతడు సినిమాలకు ఫ్యాన్స్ ఉండటంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు