Kollywood : ఒకే సినిమాలో బ్రదర్స్

తమిళంలో విడుదలైన “మహానగరం” సినిమాతో దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు లోకేష్ కనగరాజ్. ఆ తర్వాత విభిన్న చిత్రాల కథానాయకుడు కార్తీ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “ఖైదీ”. ఈ సినిమా షూటింగ్ ని కేవలం 36 రాత్రుల్లో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత దళపతి విజయ్ తో 2001 ” మాస్టర్” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” చేశాడు. ఈ సినిమా బాస్టర్ హిట్ ని సొంతంచేసుకుంది. లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ మలయాళం లో సూపర్ హిట్ అయిన ” అయ్యప్పనుమ్ కొషియుమ్” సినిమాను చూశానని తెలిపారు. అంతేకాదు ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ” అయ్యప్పనుమ్ కొషియుమ్” చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజు మీనన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే లోకేష్ కనగరాజ్ తీయబోయే రీమేక్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో కార్తీ, బీజు మీనన్ పోషించిన పాత్రలో సూర్యను చూపించాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం విజయ్ తో ఓ ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో ఉన్నారు లోకేష్. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే కార్తీతో ” ఖైదీ 2″ ని పూర్తి చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తవగానే దీనిపై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ అన్నదమ్ములను ఓకే సినిమాలో చూడాలనుకుంటున్న ప్రేక్షకుల కల త్వరలోనే నెరవేరనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు