నిఖిల్ సిద్ధార్థ నటించిన ఎపిక్ అడ్వెంచర్ కార్తికేయ 2 ప్రతిచోటా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంతో పాటు అగ్ర దర్శకులు, హీరోలు, సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది.
థియేటర్లు మరియు OTTలో మంచి రికార్డ్స్ సృష్టించిన తర్వాత, ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్లో చాలా మంచి TRP రేటింగ్లను పొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగులో ప్రసారం కావడం ద్వారా 7.88 రేటింగ్ను అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ‘కార్తికేయ 2’కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది.
థియేటర్లలో, OTTలో మరియు ఇప్పుడు ఇంట్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు పట్ల చిత్ర బృందం ఆనందంగా వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మకంగా 120 కోట్లను వసూలు చేసింది మరియు Zee 5 OTTలో కూడా భారీ బ్లాక్బస్టర్గా నిలిచి సంచలనాన్ని కొనసాగించింది.
ఒక తెలుగు సినిమాకి ఇంత విస్తృతమైన ప్రశంసలు మరియు విజయాలు రావడం చాలా అరుదు. రిలీజ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ చిత్రబృందం ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ కి, విజన్ కి మంచి ఫలితం దక్కింది.
2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘కార్తికేయ 2’ సూపర్నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. చందూ మొండేటి దర్శకత్వం వహించారు. TG విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మించారు, కార్తికేయ 2 లో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు హర్ష కూడా తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.