Chiranjeevi: తొమ్మిదేళ్ల తర్వాత బుల్లితెరపై “ఇంద్ర” సేనుడి దర్శనం.. ఇక టిఆర్పి రేటింగ్ల రచ్చ ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఇంద్ర” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 21యేళ్ళ కింద రిలీజ్ అయిన ఆ సినిమా చిరంజీవికి ఎనిమిదో ఇండస్ట్రీ హిట్ ని ఇవ్వగా, టాలీవుడ్ లో 30 కోట్ల కి పైగా షేర్ సాధించిన తొలి సినిమా గా నిలిచింది. ఇక అప్పట్లోనే 122 సెంటర్లలో 100 రోజులాడిన ఈ సినిమా 32 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఇక 33 కోట్ల షేర్ సాధించిన ఇంద్ర రికార్డులను బ్రేక్ చేయడానికి పోకిరి దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా బుల్లితెరపై కూడా ఎప్పుడు టెలికాస్ట్ అయినా టిఆర్పి రేటింగ్ లు బద్దలయ్యేవి. అయితే జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ఇంద్ర సినిమా కొన్నేళ్లుగా టెలికాస్ట్ కావడం లేదు. కనీసం చిరు బర్త్ డే రోజైనా వేస్తారని చిరంజీవి సీనియర్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినా అది జరగలేదు. చివరగా 2014 లో టెలికాస్ట్ కాగా, ఫైనల్ గా తొమ్మిదేళ్ల తరువాత ఇంద్ర మళ్ళీ స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కాబోతుంది.

అయితే తాజాగా ఇంద్ర సినిమా టెలివిజన్ రైట్స్ ని జెమిని టీవీ నుండి జీ తెలుగు ఛానెల్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ డిసెంబర్ 17 న అనగా ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం కానుంది ఇంద్ర సినిమా. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆరోజు ఎక్కువ మంది ఆడియన్స్ బిగ్ బాస్ షో చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ డే అదే రోజు కానుండగా, ఆరోజు స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు