Disha Patani : బికినీతో మండుటెండల్లో మంటలు రేపుతున్న హీరోయిన్

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై, బాలీవుడ్ లో అడుగుపెట్టి రాణిస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో దిశా పటాని ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లోఫర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ, ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ తన గ్లామర్ షోతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది.

ఈ బ్యూటీ ఒక సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాల్లో కూడా గ్లామర్ షో చేయడానికి ఏ మాత్రం వెనకాడదు. బీ టౌన్ లో తరుచు జరిగే ఈవెంట్స్ లో తన అందాలను ఏ మాత్రం దాచుకోకుండా, దుస్తులను ధరిస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ అమ్మడు డ్రెస్ స్టైల్ చూసి కొన్ని సార్లు నెటిజన్లు.. బాలీవుడ్ లో మరో ఉర్ఫి జావెద్ ఉంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ ఓ పోస్ట్ ను షేర్ చేసింది.

ఈ పోస్ట్ లో దిశా పటాని స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంది. బికినీ ధరించిన దిశా పటాని, తన అందాలను చూపిస్తుంది. అప్పుడే స్విమ్మింగ్ చూసి, సేదా తీరుతున్న దిశా పటాని ఫోటోను చూసి, యూత్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలే బయట మండుటెండలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇన్‌స్టాలో ఇలాంటి మంటలు పెడితే ఎలా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు