Lover boy :తరుణ్ పెళ్లిపై తల్లి రోజా రమణి ఆసక్తికర వ్యాఖ్యలు..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకప్పుడు లవర్ బాయ్ గా స్టార్ హీరో ఇమేజ్ ని కైవసం చేసుకున్న తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మనసు మమత తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. “నువ్వే కావాలి” సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని యూత్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత ప్రియమైన నీకు, నువ్వులేక నేనులేను, నువ్వే నువ్వే సినిమాలతో స్టార్ హోదాను సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన భలే దొంగలు, ఎలా చెప్పను, సోగ్గాడు వంటి చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. కొంతకాలం వరుస పరాజయాలు రావడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

2018లో చివరిసారిగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఇక ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు తరుణ్. నిజానికి మళ్లీ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల తరుణ్ పెళ్లి గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి. అయితే వీటిపై తరుణ్ తల్లి, నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజా రమణి స్పందించారు.

కొంతమంది ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ రాస్తారని.. అవి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందన్నారు. తరుణ్ రోజు రెండున్నర గంటల పాటు పూజలు చేస్తాడని, ప్రతి ఏడాది తిరుమలకు వెళతారని చెప్పారు. ఇక తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తో పాటు.. ఓ సినిమా చేయనున్నారని.. అయితే వీటిలో ఏది ముందు మొదలవుతుందో చెప్పలేను అన్నారు. ఇక తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు పెద్దగా కోరికలు అంటూ ఏమీ లేవని.. తన కొడుకు పెళ్లి అయితే చాలని అంతకుమించి ఏమీ లేవని, తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే అవుతుందని పేర్కొన్నారు. తన చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్లు చేశానని.. ఆ ఆశీర్వాదాలు తన కుమారుడికి దక్కుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు