మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 05న దసరా సందర్భంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరన్న అనే టైటిల్ పరిశీస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
అత్యంత త్వరలోనే ఈ సినిమా టైటిల్కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వడంతో పాటు సినిమా ఫస్ట్ లుక్ను రివీల్ చేసే అవకాశముంది. ఇదే సమయంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ లీక్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ నిన్నటి వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్వహించారు. ఇప్పుడు గ్రామానికి సంబంధించిన సన్నివేశాల కోసం రాజమండ్రిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.
ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు రవితేజ కూడా జాయిన్ అవ్వబోతున్నాడట. ఈ షెడ్యూల్లోనే రవితేజ, చిరంజీవి కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని చిత్రబృందం పేర్కొంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో వెంకటేష్ కూడా కనిపించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఇందులో వాస్తవం ఎంతో అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.