Aravind Swamy : రెండోసారి..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మంచి జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది రెండు తెలుగు, ఒక బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బంగర్రాజు సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన థాంక్యూ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో పాటు బాలీవుడ్ లో మొదటి సారి చేసిన లాల్ సింగ్ చడ్డా కూడా హిట్ కాలేదు. దీంతో ఈ యువ సామ్రాట్ తర్వాత సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది.

నాగ చైతన్య తన తర్వాత సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తర్వాత షెడ్యూల్ మైసూర్ లో ప్రారంభం కానుందని సమాచారం.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడట. చైతన్యకు విలన్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన తెలుగులో ఇప్పటికే ఒకసారి ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు