Pushpa The Rule : మేకర్స్ పై బన్నీ ఫైర్… రష్మిక వల్లే!

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2” ( Pushpa The Rule ) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ చిత్ర బృందంపై సీరియస్ అయ్యారని సమాచారం. ఇదివరకు మూవీ షూటింగ్ లేటవుతుంది అంటూ డైరెక్టర్ సుకుమార్ పై బన్నీ సీరియస్ అయ్యాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్మిక వల్ల మరోసారి మేకర్స్ పై అల్లు అర్జున్ ఫైర్ అయ్యారు అని టాక్. మరి ఇంతకీ రష్మిక ఏం చేసింది? అల్లు అర్జున్ కు ఎందుకంత కోపం వచ్చింది? అనే వివరాల్లోకి వెళ్తే…

అల్లు అర్జున్ కోపానికి కారణమైన రష్మిక…

2024లో రిలీజ్ కాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో “పుష్ప 2” కూడా ఒకటి. 2021లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన పుష్ప మూవీకి సీక్వెల్ గా రూపొందుతోంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా లీకులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పుష్ప 2 షూటింగ్ సెట్స్ నుంచి రష్మిక మందన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందులో రష్మిక రెడ్ కలర్ శారీ కట్టుకొని, తల నిండా మల్లె పువ్వులు పెట్టుకొని అందంగా కనిపించింది. వాటిని చూసి రష్మిక అభిమానులంతా తెగ సంతోష పడిపోయారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప… లీకైన రష్మిక పిక్స్ అల్లు అర్జున్ నిరాశపరిచాయట. దీంతో సెట్స్ నుంచి ఇలా ఫోటో లీక్ అవ్వడంపై ఆయన మేకర్స్ పై ఫైర్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. మరోసారి ఇలా జరగకుండా చూసుకోమని మందలించారట అల్లు అర్జున్. గతంలో కూడా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుందనే కారణంతో సుకుమార్ పై అల్లు అర్జున్ సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి.

బన్నీ ఫ్యాన్స్ అసహనం…

పుష్ప 2 మూవీ 2024 ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసి చాలా కాలమే అవుతుంది. కానీ అప్పటినుంచి ఒక టీజర్, కొన్ని పోస్టర్స్ తప్ప ఇతర అప్డేట్లేవీ రిలీజ్ కాలేదు. అలాగే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లేట్ కావడం, వాయిదాలు పడడం లాంటివి జరగడంతో పుష్ప 2 ( Pushpa The Rule ) పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ అదే సమయంలో పుష్ప 2 థియేటర్లలోకి రావడానికి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉందంటూ మరో కొత్త పోస్టర్ తో రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు మేకర్స్. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు మించి ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా పెద్దగా అల్లు అభిమానులు పండగ చేసుకునే అప్డేట్స్ ఏమీ రాలేదు. ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానుల అసహనానికి కారణం అవుతోంది. మూవీ రిలీజ్ కు ఇంకా దాదాపు 5 నెలల సమయం ఉండడంతో ఇప్పట్లో అప్డేట్స్ ఉండే అవకాశం కూడా లేదు. కొంతమంది మాత్రం చెప్పినట్టుగానే ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అది చాలు అని సరిపెట్టుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు