Adivi Sesh: ఇది కదా కావాల్సింది

తెలుగులో ఈ రోజు రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన సీతా రామం. మరొకటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార. ఈ రెండు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుని థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద జనాలు కనిపిస్తున్నారు. అలాగే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల దర్శకులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

శుక్రవారం ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు ఈ రెండు చిత్ర బృందాలకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా మేజర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న అడివి శేష్ కూడా ఈ రెండు సినిమాలకు వస్తున్న పాజిటివ్ రివ్యూలపై స్పందించాడు. ”నేను ఉదయం లేచి చూస్తే.. నా మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం, కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇది నాకు చాలా సంతోషం వేసింది. ఇది కదా కావాల్సింది. కరోనా వచ్చి ఐసోలేషన్ లో ఉన్నా, నా కోసం మార్నింగ్ షోలో ఒక సినిమా, మ్యాట్నీ షోలో మరో సినిమా కుమ్మేయండి” అంటూ అడివి శేషు ట్వీట్ చేశాడు.

కాగా అడివి శేషుకు ఇటీవల కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. అక్కడి నుంచే ఈ ట్వీట్ చేశారు. కాగా దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. అడివి శేషు త్వరగా కోలుకోవాలని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అలాగే హిట్ 2 వస్తే, దాన్ని కూడా కుమ్మేద్దాం అంటూ మరి కొంత మంది నెటిజన్లు పోస్టుకు రిప్లే ఇస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు