Prabhas: ప్లానింగ్ దశలో ఆదిపురుష్ పార్ట్ 2- ఇంత జరిగిన బుద్ధి రాలేదా..

అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ రిలీజైన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసి, ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టు ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు ఓం రౌత్. వివరాల్లోకి వెళ్తే,

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవలనే థియేటర్స్ లో విడులైన సంగతి అందరికి తెల్సిందే. ఇండియాస్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్ రోజు నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. రామాయణం ఆధారంగా సినిమాని తెరకెక్కించమని ప్రెస్ మీట్ లలో ప్రగల్బాలు పలికిన ఈ మూవీ యూనిట్. సినిమా రిలీజ్ తరువాత మాత్రం ప్లేట్ ఫిరాయించారు.

ఇక ఈ సినిమాకి రైటర్ గా పని చేసిన మనోజ్ ముంతషీర్ అయితే, ఇంటర్యూ లలో ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న విషయం కూడా విధితమే.

- Advertisement -

అయితే ఈ సినిమాని దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా, ఇప్పటి వరకు ఈ సినిమా 450 కోట్లు మాత్రమే వసూలు చేయగా, ఇంక 250 కోట్లు వస్తే తప్ప ఆదిపురుష్ హిట్ సినిమా లెక్కలోకి రాదు. కానీ సినిమాకి వచ్చిన నెగిటివిటీ వల్ల అంత మొత్తం కలెక్ట్ చేయడం కష్టమనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి తొందర్లోనే పార్ట్ 2 కూడా రాబోతుందనే వార్త గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఆదిపురుష్ సినిమా రామ,రావణ సంహారం తరువాత వెంటనే ఎండ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు రాబోయే ఆదిపురుష్ పార్ట్ 2 లో సీత అయోధ్యకి వచ్చిన తరువాత జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఓం రౌత్ ప్రభాస్ కు వినిపించగా ప్రభాస్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ఈ విషయం బయటికి పొక్కడంతో అందరు ఓం రౌత్ ను ఇంత జరిగిన బుద్ధి రాలేదా, ఫ్లాప్ సినిమాకి పార్ట్ అవసరమా అంటూ మిమ్స్ వేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు