Mannara Chopra : ఎయిర్ లైన్స్ తో రాజ్ తరుణ్ హీరోయిన్ వివాదం… మరీ ఇంత దారుణమా?

హీరోయిన్ మన్నారా చోప్రా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ అందరి ముందు ఆమెకు ముద్దు పెట్టడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తన సినిమాల కంటే ఎక్కువగా ఈ వివాదంతోనే మన్నారా తెలుగు ఆడియన్స్ మనసులో నిలిచిపోయింది. కాజల్ హీరోయిన్ గా నటించిన “సీత” సినిమా రిలీజ్ సమయంలోనే ఈ వివాదం చోటు చేసుకుంది. రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ సీజన్ 17 లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి మరింత పాపులరిటీని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక ఎయిర్ లైన్స్ విషయంలో చేదు అనుభవం ఎదురైందట. చెత్త ఎక్స్పీరియన్స్ అంటూ ఆ ఎయిర్ లైన్స్ పై ఫైర్ అయ్యింది మన్నారా.

ఈ విషయంపై మన్నారా ట్వీట్ చేస్తూ ఎయిర్ లైన్స్ సిబ్బంది తీరుతో తాను చాలా ఇబ్బంది పడ్డానని, ఇలా జరగడం రెండవసారి అని, తను ప్రయాణించిన ఎయిర్ లైన్స్ లో @AkasaAir అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ అంటూ మండిపడింది. తనకు ఎదురైన ఆ ఇబ్బందులు ఏంటో కూడా ట్వీట్ ద్వారా వెల్లడించింది మన్నారా. గతంలో తన బ్యాగ్ డామేజ్ అయిందని, ఇప్పుడేమో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని, పైగా తనతో దురుసుగా ప్రవర్తించారంటూ సదరు సంస్థను ట్యాగ్ చేసింది. ఆ ఎయిర్ లైన్స్ సంస్థ మన్నారా ట్వీట్ పై స్పందిస్తూ “మన్నారా, మీకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాము. అదనపు ప్యాకేజీ ఫీజు విధానాన్ని మిమ్మల్ని కలిసిన మా టీం ఎయిర్పోర్ట్ లోనే వివరించి ఉంటుందని అనుకుంటున్నాము.

కొన్ని నిబంధనల దృష్ట్యా అదనపు బ్యాగేజీ ఫీజును తిరిగి ఇవ్వలేము. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇంకేమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి, పరిష్కరిస్తాం అంటూ రిప్లై ఇచ్చారు. వాళ్ళ రెస్పాన్స్ చూసి మండిపోయిన మన్నారా అసహనంతో “అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఈరోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. అదే విషయాన్ని మీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే ఆమె బాగా నటిస్తూ మా మేనేజర్ తో మాట్లాడండి అని చెప్పింది. మీ మేనేజర్ కూడా కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు, సమస్యను పరిష్కరించలేదు. మీ సిబ్బంది నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు” అంటూ ట్వీట్ చేసింది.

- Advertisement -

ఆ తర్వాత సదరు ఎయిర్లైన్స్ వారు మన్నారాకు సుదీర్ఘ వివరణ ఇస్తూ పోస్ట్ చేశారు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఎయిర్ లైన్స్ వారి పోస్ట్ చూసిన తర్వాత చాలామంది మన్నారాను టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఎలాంటి స్పీచ్ చెల్లించకుండానే ఫ్రెంట్ సీట్ అడగడం కామెడీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఫీ పేరుతో ఆమెను డిఫెరెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటూ ఎయిర్ లైన్స్ పైనే ఫైర్ అవుతున్నారు.

మొత్తానికి మన్నారా, ఎయిర్ లైన్స్ మధ్య జరిగిన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం తెలుగులో మన్నారా “తిరగబడరా సామి” అనే సినిమాలో నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మన్నారాతో పాటు మాల్వి మల్హోత్రా మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమాలో మన్నారా సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. మల్కాపురం శివరాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు