Allari Naresh : ఈ సారి గట్టెక్కుతాడా ?

సినిమా ఇండస్ట్రీలో రోజులు మారాయి. ఇంతకు ముందు ఉన్నట్టు ప్రేక్షకులు ఉండటం లేదు. కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. కొన్ని పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ తో వచ్చే సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకుంటున్నాయి. ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా నిర్మాణ సంస్థలు కనుమరుగు అయిపోయాయి. అందులో ఈవీవీ సినిమా కూడా ఒకటి. ప్రముఖ దర్శక నిర్మాత ఈవీవీ సత్యనారాయణ ఈ నిర్మాణ సంస్థను స్థాపించాడు. తన దర్శకత్వంలో వచ్చే సినిమాలను ఈవీవీ సినిమా సంస్థతో నిర్మించేవాడు.

ఈవీవీ కుమారులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ ల సినిమాలు ఎక్కువగా ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చాయి. ఈవీవీ సత్యనారాయణ మరణాంతరం, ఈవీవీ సినిమా బాధ్యతలను అల్లరి నరేష్ తీసుకున్నాడు. తన బందిపోటు సినిమాకు నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నాడు. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టార్ అయింది. నరేష్ కోలుకోలేని స్థాయికి వెళ్లిపోయాడు. దీని తర్వాత ఈవీవీ సినిమాను టచ్ చేయలేదు.

అయితే ప్రస్తుతం ఓటీటీ కాలం వస్తున్న నేపథ్యంలో ఈవీవీ సినిమాను మళ్లీ తీసుకురావాలని నరేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని బాధ్యతలను తన సోదరుడు ఆర్యన్ రాజేష్ చేతిలో పెట్టి, ప్రతి ఏడాది ఒక సినిమా, ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఒకసారి ఈవీవీ సినిమాతో నష్టాలపాలైన నరేష్, ఇప్పుడైనా సక్సెస్ అవుతాడా లేదా మళ్లీ కష్టాలు కొని తెచ్చుకుంటాడో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు