మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఉదయం నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది.
వంశీ దర్శకత్వం వహించిన తెలుగు పీరియడ్ యాక్షన్ త్రిల్లర్ మూవీలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ కేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రవితేజ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని….ఇక యాక్షన్ సన్నివేశాలు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వచ్చాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు భారతదేశంలో భారీగానే వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది.
అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రేణు దేశాయ్. కాగా, నిజానికి ఈ రోల్ లో డైరెక్టర్ ముందుగా రమ్యకృష్ణను అనుకున్నారట. రేణు దేశాయ్…. హేమలత లవణం అనే సామాజిక సంఘసంస్కర్త పాత్రలో కీరోల్ పోషించారు. అయితే నిజానికి ఈ పాత్ర ముందుగా రమ్యకృష్ణ కోసం అనుకున్నారట. కానీ రమ్యకృష్ణ ఈ కథ కాంట్రవర్సీయల్ గా మారుతుందని అనుకోని సినిమా నుంచి తప్పకున్నట్లు తెలుస్తోంది.