Manchu Manoj: మంచు ఫ్యామిలీలో మంట ఇంకా చల్లారలేదా..?

మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య అబిప్రాయభేదాలున్నట్లు కొంత కాలం కిందట వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ అప్పట్లో సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మనోజ్ పెళ్లి సందర్బంగా ఆ గొడవలు ఇంకా తగ్గలేదని స్పష్టం అయ్యింది. మంచు లక్ష్మి బలవంతం చేయటంతో మోహన్ బాబు పెళ్ళికి ఒప్పుకోవటం, విష్ణు నామమాత్రంగా హాజరవటం ఇందుకు కారణం. తరచూ సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యే మంచు ఫ్యామిలీ గురించి మీడియా ప్రశ్నించగా మనోజ్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియా ఆగ్రహానికి గురయ్యాడు ఒక సందర్భంలో. తాజాగా, మోహన్ బాబు మరోసారి మీడియాపై ఫైర్ అయ్యి వార్తల్లో నిలిచాడు.

రిజిస్ట్రేషన్ పని మీద షాద్ నగర్ వెళ్లిన మోహన్ బాబును మీడియా చుట్టుముట్టడంతో ‘ మీకు బుద్ధి లేదా?’ అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు డైలాగ్ కింగ్. వివరాల్లోకి వెళితే, మంచు విష్ణు, మనోజ్ ల మధ్య గొడవలు తీవ్రం అయ్యాయని, ఆ గొడవలు ఆస్తి పంపకాల రావటంతో ఆ పనుల మీద మోహన్ బాబు షాద్ నగర్ వెళ్లారని సమాచారం. ఈ వ్యవహారాన్ని చడీ చప్పుడు కాకుండా ముగించుకోవాలని అనుకున్న మోహన్ బాబును మీడియా చుట్టుముట్టడం వల్ల అసహనానికి గురయ్యాడని అంటున్నారు.

మొత్తానికి మంచు ఫ్యామిలిలో మంట ఇంకా చల్లారలేదని ఈ సంఘటన ద్వారా స్పష్టం అయ్యిందని చెప్పచ్చు. నిత్యం డిసిప్లిన్, పంచువాలిటీ అంటూ ప్రవచనాలు వల్లించే మోహన్ బాబు తన కొడుకులను సరైన దారిలో పెట్టలేకపోయాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి, ఆస్తి పంపకాల తర్వాత అయినా విష్ణు, మనోజ్ ల మధ్య విభేదాలు క్లియర్ అవుతాయా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు