Vyuham: టార్గెట్ ‘మెగా’ – ప్రకంపనలు రేపుతున్న ఆర్జీవీ ట్వీట్..!

నిత్యం వివాదాలతో సహజీవనం చేసే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో వ్యూహం సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సృష్టించిన దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘వ్యూహంలో ఎవరున్నారు’ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ లని పోలి ఉన్న నటులు ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. టీజర్ ద్వారా చంద్రబాబుని టార్గెట్ చేసిన ఆర్జీవీ,ఇప్పుడు ఈ పోస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. 2009 నుండి 2014 నాటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిరంజీవిలను ఏ అంశం మీద టార్గెట్ చేసాడు అన్న ఆసక్తి నెలకొంది.

వైఎస్ మరణం ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా టీజర్లో చంద్రబాబుని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసాడు వర్మ. ఇప్పుడు ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫోటో ద్వారా ప్రజారాజ్యం పార్టీ విలీనం, జనసేన ఆవిర్భావం వంటి అంశాలతో మెగా బ్రదర్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఏదేమైనా ఒకప్పుడు ఇండియన్ సినిమా మేకింగ్ లో విప్లవం తెచ్చిన రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శక దిగ్గజం ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ మౌత్ పీస్ లాగా మారటం శోచనీయం.

2019 ఎలక్షన్ సమయంలో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో పొలిటికల్ క్యాంపెయిన్ చేసిన వర్మ ఇప్పుడు 2024 ఎలక్షన్ టార్గెట్ గా ‘వ్యూహం’ రచిస్తున్నాడు. నిజమో కాదో తెలియని, ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా సినిమా చేసి పొలిటికల్ మైలేజ్ పొందాలన్న ప్రతిసారి వర్కౌట్ అవుతుందని అనుకుంటే పొరపాటే అని చెప్పాలి. మరి, సినిమా రిలీజ్ కి ముందే ప్రకంపనలు రేపుతున్న ఈ సినిమా ఇంకెన్ని వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు