Tollywood: సమ్మర్ బోసిపోయింది, వర్షాకాలం అయినా కలిసొస్తుందా..?

ఈ వేసవి టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి, బిగినింగ్ లో వచ్చిన దసరా, విరూపాక్ష లాంటి మీడియం రేంజ్ సినిమాలు మినహా ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఇక ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ, సోమవారం నుండి కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ నమోదయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్ కి జరిగిన బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితి. మొత్తం మీద ఈ ఏడాది సమ్మర్ ని టాలీవుడ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ సీజన్లో రిలీజ్ అవనున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

జూన్ 29న విడుదల కానున్న నిఖిల్ ‘స్పై’ సినిమాతో మొదలుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ ల ‘బ్రో’, మెగాస్టార్ నటించిన ‘భోళాశంకర్’ వంటి సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ప్రధానంగా తెరకెక్కిన స్పై సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కార్తికేయ2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సముద్రఖని డైరెక్షన్లో పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 29న రిలీజ్ కి సిద్ధమవుతోంది.

ఇక మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ అయినప్పటికీ మెగాస్టార్ సినిమా కావటంతో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటించిన ఈ సినిమాలో తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటించింది. సమంత, విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుండగా, బేబీ, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరి, వర్షాకాలంలో అయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు