Sandeep Reddy Vanga: సందీప్ పై అలాంటి ఆరోపణలు.. కష్టాలు తెలిస్తే షాక్..!

తెలుగు సినీ ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టి .. ఓవర్ నైట్ లోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తరువాత ఇదే చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయగా.. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు సందీప్ కి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరును కూడా తెచ్చి పెట్టింది.

అయితే ప్రస్తుతం సలార్ సినిమా విడుదల కావడంతో యానిమల్ సినిమా హవా తగ్గిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో యానిమల్ సినిమాతో మరొక సరికొత్త కథాంశాలకు తెర లేపారని చెప్పవచ్చు. చేసిన సినిమాలు తక్కువే అయినా.. తన టాలెంట్ తో పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నే షేక్ చేసేలా కనిపిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదని తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

సందీప్ రెడ్డి వంగా సైకో థెరపీ లో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేశారట. అంతేకాకుండా తాను చదువుకున్న సమయంలో జరిగిన సన్నివేశాలను దృష్టిలో పెట్టుకొని.. విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి సినిమా చేసి.. ఈ మూవీ లో తనని మెడికల్ స్టూడెంట్ గా చూపించి.. అక్కడి విషయాలను ఇక్కడ సినిమాగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ.. సందీప్ పై విమర్శలు కూడా గుర్తించారు కొంతమంది నెటిజన్స్.

- Advertisement -

ఇకపోతే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా కష్టపడ్డారని సమాచారం. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం. అయితే ఈ డైరెక్టర్ కి మాత్రం కాస్త డిఫరెంట్ అని కూడా తెలుస్తుంది.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తన బయోడేటా పెట్టుకుని తిరుగుతూ.. అసిస్టెంట్ డైరెక్టర్ కావడానికి చాలా ప్రయత్నాలు చేశారట.. అలా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతల ఇంటికి వెళితే గేటు దగ్గరే రెస్యూమ్ పెట్టి వెళ్లిపోమంటూ చాలామంది అవమానించారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇవన్నీ తనకు బాధ కలిగించడంతో ముందుగా ఒక స్టోరీని రెడీ చేసి ఫైనాన్షియర్ ను కూడా సిద్ధం చేసుకున్నారట. సినిమా తీద్దామనే లోపు ఫైనాన్షియర్ హ్యాండ్ ఇవ్వడంతో.. సినిమా నిర్వహణ బాధ్యత కోసమే తన 36 ఎకరాల పొలాన్ని కూడా అమ్మి మొదటి చిత్రాన్ని నిర్మించారట.. ఆ తర్వాతే తనకు వచ్చిన డబ్బులతో తిరిగి తాను అమ్మిన 36 ఎకరాల పొలాన్ని కొనుక్కొని.. మిగిలిన డబ్బుతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాని తెరకెక్కించారట. ప్రస్తుతం యానిమల్ సినిమాతో ఏకంగా రూ.1260 కోట్ల బిజినెస్ ని చేశారట. అందుకే నిర్మాతగా తాను తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా భాగమై రూ. 450 కోట్లకు పైగా ఆస్తిని సంపాదించారని తెలుస్తున్నది. సందీప్ రెడ్డి వంగ స్కూల్ ఆఫ్ సిడ్ని , థియేటర్ అండ్ టెలివిజన్ విద్యను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఏ ఏ హీరోలతో ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు