కోలీవుడ్ నటుడు సముథ్ర ఖని అంటే తెలియని వారు లేరు. ఒక తమిళంలోనే కాదు, తెలుగులోనూ బిజీ నటుడు. ఒక నటుడిగానే కాదు.. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలకు దర్శకుత్వం కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఈ విలక్షణ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో వచ్చిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో పవన్ తో రీమేక్ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో పవన్ దేవుడి పాత్ర చేస్తుండగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా సముథ్ర ఖని ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో `సముద్రఖని దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది` అంటూ నితిన్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడే సముథ్ర ఖని కూడా ‘నితిన్ తో సినిమా ఉంటుంది. రెండేళ్ల క్రితమే కథ గురించి మాట్లాడుకున్నాం. సమయం కుదిరినప్పుడు సినిమా వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.
అయితే సముథ్ర ఖని చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత నితిన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. సముథ్ర ఖని ప్రస్తుతం గాడ్ ఫాదర్, దసరా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు పవన్ తో రీమేక్ సినిమా ఉంది. ఇక్కడ పవన్ సినిమా ఆలస్యమైతే, నితిన్ తో సినిమా ముందుకు వస్తుందని, ఒకవేళ పవన్ సినిమా షెడ్యూల్ ప్రకారం ఉంటే, దీని తర్వాత నితిన్ తో సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. దీనికి అనుకూలంగా సముథ్ర ఖని కూడా షెడ్యూల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.