Sai Dharam Tej: డబ్బులు కాదు… జ్ఞాపకాలు ముఖ్యం

ఇటీవల కాలంలో ఒక వార్త టాలీవుడ్ ను షేక్ చేసింది. అదేంటంటే, తమిళంలో మంచి విజయం అందుకున్న వినోదయ సీతం రీమేక్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 85 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఈ సినిమాలో పవన్ పాత్ర చిన్నదిగానే ఉంటుంది. దీనికి పవర్ స్టార్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ 20 రోజలకే 85 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంటే రోజుకు 2 కోట్ల వరకు పవన్ పారితోషికం అందుకుంటున్నాడు.

ఇటీవల కాలంలో ఒక టాలీవుడ్ హీరో ఇంతలా రెమ్యునరేషన్ అందుకోలేడు అని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకునేది తమ పవర్ స్టారే అని అభిమానులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో పవన్ కి ఉండే క్రేజ్ వల్లే ఇలాంటి భారీ పారితోషికం వస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందని జోస్యం చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెమ్యునరేషన్ గురించి అయితే ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. PKSDT కి ఈ మెగా మేనల్లుడు ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదట. ఫ్రీగానే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఈ సినిమాను పవర్ స్టార్ కోసమే సాయి ధరమ్ తేజ్ చేస్తున్నాడట. దీనిపై సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ లో కూడా ఓ పోస్ట్ వేశాడు. “ఇది నాకొక గొప్ప అవకాశం చెప్పుకొచ్చాడు. గురువుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ తో PKSDTకి సాయి ధరమ్ తేజ్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.

అయితే దీనిపై మరోలా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కి కలిపి 85 కోట్ల రెమ్యునరేషన్ ను నిర్మాతలు ఇచ్చారని కొంత మంది అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు