Renudesai: ప్రేమలో పడ్డ రేణు దేశాయ్.. పవన్ ఫ్యాన్స్ కి ఝలక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన భర్త నుంచి దూరమైన తర్వాత కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచే ఈమె.. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమ, సహజీవనం, పెళ్లి అంటూనే.. పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనివ్వడం అన్ని అలా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టిన ఈమె.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇక అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తో విభేదాలు వచ్చి విడాకులు తీసుకొని పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్న విషయం తెలిసిందే.

ఇక భర్తతో విడిపోయిన సరే సమాజ సేవ చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రేణు పాత్రకు మాత్రం మంచి పేరు లభించింది. ఇక ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె తన పిల్లలతో ఎంజాయ్ చేసే ప్రతి క్షణాలను.. సమాజంలో ఆమెను కదిలించే అంశాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా యానిమల్ సినిమా రివ్యూ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు అంత వైలెన్స్, న్యూడిటీ ఉన్న సినిమాకి రివ్యూ ఇస్తే నెటిజన్లు ఎక్కడ తనను ట్రోల్ చేస్తారో అని చాలామంది సినిమా గురించి చెప్పడం మానేశారు. కానీ ఈమె మాత్రం ఈ సినిమాతో ప్రేమలో పడిపోయానని చెప్పి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా ఝలక్ ఇచ్చింది.

ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో యానిమల్ పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఎట్టకేలకు సినిమా నిన్ననే చూడాల్సి వచ్చింది.. నిస్సందేహంగా ఈ సినిమాతో ప్రేమలో పడ్డాను.. క్రేజీ, బ్లడీ యాక్షన్ సీక్వెన్స్ ల కారణంగా బలహీన హృదయం ఉన్న వారి కోసం కాదు.. కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా అనుభూతి పొందాలి అనుకుంటే కచ్చితంగా థియేటర్లలో సినిమా చూడడం మిస్ అవ్వకండి.. అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు