మాస్ మహారాజా రవితేజ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజుకి కూడా మాస్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రవితేజ పేరే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ.
ధమాకా సినిమాతో సోలోగా, వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో కలిసి వరుసగా రెండుసార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాడు. ఇక ఈమధ్య వచ్చిన రావణాసుర సినిమా ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ ఆయనకి అభిమానులలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా డీసెంట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే రావణాసుర ప్లాప్ తో సంబంధం లేకుండా రవితేజ మళ్ళీ పారితోషికం పెంచేయడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది.
రావణాసుర సినిమాకి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న రవితేజ.. ఆ మధ్య తన పారితోషికాన్ని 25 కోట్ల వరకు పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా రవితేజకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనుందట. దీంతో రవితేజ పారితోషికం న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన అనంతరం రవితేజ తన తదుపరి సినిమా “ఈగల్” తో బిజీగా మారనున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News